
పక్క రాష్ట్రానికి వెళ్ళి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న జనసైనికులు
ఈ కరోనా విపత్కర సమయంలో చాలా మందికి రక్తం అవసరం అయినా, రక్తం దానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రక్తదానం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది యువత రక్తదానం చేయడానికి భయపడుతున్నారు. ఇలాంటి కరోనా విపత్కర సమయంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన ఇచ్చిన జనసేవ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు రక్తం ఇవ్వడానికి పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఇవ్వడం సంతోషకరం. వివరాల్లోకి వెళ్తే ఇచ్చాపురం నియోజకవర్గ నాయకులు తిప్పన దుర్యోధన రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సుమారుగా 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పటి వరకూ సుమారు 400 యూనిట్స్ బ్లడ్ రోగులకి ఇప్పించారు. ఈరోజు మండపల్లి గ్రామానికి చెందిన జగదీశ్ సాహు కి (వయస్సు 24) హార్ట్ సర్జరీ కోసం ‘O’ నెగిటివ్ బ్లడ్ అవసరమైతే , ఇచ్ఛాపురం నుండి భువనేశ్వర్ (ఒరిస్సా) వెళ్లి ప్రైవేటు హాస్పటల్ లో ఉన్న జగదీష్ సాహు గారికి ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకులు తిప్పన దుర్యోధన రెడ్డి వెళ్లి రక్త దానం చేశారు.








