తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆన్నదాన కార్యక్రమం

తెలంగాణ

               తెలంగాణ రాష్ట్ర ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసేన పార్టీ కూకట్ పల్లి  నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్ ప్రెసిడెంట్ లతో కలిసి బాలానగర్ మరియు మూసాపేటలో పేద ప్రజలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు. జనసేన నాయకులు మాట్లాడుతూ కోట్లాది మంది తెలంగాణ బిడ్డల ఆశలు ఆకాంక్షల ప్రతిరూపమే ఈ తెలంగాణ రాష్ట్రము. వేలాది మంది వీరుల త్యాగ ఫలితము తోటే ఈ తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది అని అన్నారు. ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు వీర మహిళలు ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాలపై పోరాడుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వివిధ డివిజన్ల ప్రెసిడెంట్ లు 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్, 117 డివిజన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ నాగేంద్ర బాబు 118 డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు 121 డివిజన్ ప్రెసిడెంట్ మహేష మరియు జనసైనికులు రాము వినోద్ కుమార్, వెంకట్రావు చరణ్ తదితరులు పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  రోడ్డు ప్రమాదంలోని బాధిత కుటుంబానికి రూ.16,000 ఆర్థిక సహాయం చేసిన కర్నాటక జనసైనికులు