
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్ళు : జనసేన నాయకుల సహాయం
విజయనగరం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు కాలిపోయి 3కుటుంబాలు రోడ్డున పడ్డారు. వారికి ఆసరాగ జనసేనపార్టీ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, పంచదార, కూరగాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఓదార్చారు. ఇంచార్జ్ రేగు.మహేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవడం మానవులుగా ముఖ్య కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో సాలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ రేగు.మహేశ్వరరావు గారు మరియు పార్టీ నాయకులు శివ, సంతోష్ కుమార్, మురళి, జ్యోతిప్రకాష్, చంటి, వంశీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.








