
కొల్లిపర సహస్ర ను ఘనంగా సన్మానించిన ఆర్య వైశ్య సంఘాల నాయకులు.
సత్తెనపల్లి,మే 07 ( జనస్వరం )
ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు డాక్టర్ కొత్త రామకృష్ణ మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో సిద్దికా కోచింగ్ సెంటర్ లో చదివి పాలిటెక్నిక్ లో స్టేట్లో 633 ర్యాంకు సాధించి 120 మార్కులు గాను 112 మార్కులు సాధించి కొల్లిపర సహస్రను ఘనంగా సన్మానించడం జరిగింది.కొత్త రామకృష్ణ మాట్లాడుతూ విద్యలో ప్రతిభ కనబరిచిన వారందరికీ సన్మానించడం వారి ప్రతిభని ప్రోత్సహించుట తద్వారా ఇంకా మంచి ర్యాంకులు సాధిస్తారని కొనియాడారు.ఆ తర్వాత సహస్ర ను సన్మానించి తదుపరి సిద్ధికా మహిళ జూనియర్ కాలేజ్ చైర్మన్ సుభానిని ప్రత్యేకంగా అభినందనలు తెలియ జేశారు.చలివేంద్ర సంఘం అధ్యక్షులు బచ్చుకొండలు మాట్లాడుతూ ఇలాంటి సన్మానాలు మునుముందు ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఫ్యూచర్లో మంచి ర్యాంకులు సాధించాలని సహస్రాని కొనియాడారు.ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు చిల్లంచర్ల మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరికీ మేము అన్ని విషయాల్లో ముందుండి సేవలందిస్తామని ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చక్కా రవి, దేవరపల్లి కాశీ విశ్వనాథం, భవిరిశెట్టి హరి,కొల్లిపర భాను, సిద్ధికా జూనియర్ కాలేజ్ చైర్మన్ సుభాని మొదలగువారు పాల్గొన్నారు








