
భారత్ ఐకానిక్ అవార్డ్స్లో జాతీయ స్థాయి పురస్కారాల ప్రదానం చేసిన CEO జె వి ఎస్ భాస్కర్.
హైదరాబాద్,ఏప్రిల్ 29 ( జనస్వరం)
హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన భారత్ ఐకానిక్ అవార్డ్స్ (Bharat Iconic Awards) కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ అయిన డాక్టర్ జె వి ఎస్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతిభావంతులకు అవార్డులను అందజేశారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గౌరవించారు. వివిధ రంగాలకు చెందిన అవార్డు గ్రహీతలు తమ కృషి, నిబద్ధత, ప్రతిభతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ జేవీఎస్ భాస్కర్ విజయానికి పట్టుదల, కష్టపడి పనిచేయడం, నిరంతర అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. ఇటువంటి అవార్డులు వ్యక్తిగత ప్రతిభను గౌరవించడమే కాకుండా, యువతకు మరియు సమాజానికి గొప్ప ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వచ్చిన ప్రముఖులు, గౌరవ అతిథులు, విశిష్ట వ్యక్తులు హాజరై కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించారు.ఈ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించిన ట్వీల్ మ్యాగజైన్ (Tweel Magazine) వ్యవస్థాపకుడు దీపక్ కి మరియు భారత్ ఐకానిక్ అవార్డ్స్ నిర్వహణ బృందానికి చెందిన వీణా ప్రసన్న కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ జె వి ఎస్ భాస్కర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.








