నాదెండ్ల మనోహర్‌తో గిరిధర్ రెడ్డి భేటీ

నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : నెల్లూరుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శాలువా కప్పి, పూల బొకే అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా ధాన్య సేకరణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పౌరసరఫరాల వ్యవస్థ మెరుగుదలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన గిరిధర్ రెడ్డి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సానుకూలంగా స్పందించి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ సౌహార్ద వాతావరణంలో జరిగి, పరస్పర ఆత్మీయతను ప్రతిబింబించింది.

See also  ఆత్మకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు