దోస్తుల సావుతోనైనా యువతలో మార్పు రావాలి : కె. బలరాం

కర్నూలు స్వాతి కిరణం ప్రతినిధి :- ప్రస్తుత సమాజంలో యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని వారి మార్పు కోసం కృషి చేయాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె బలరాం గారు న్యాయవాది అన్నారు. నేటి సమాజంలో యువత విద్యార్థులు స్నేహము చేస్తూ, చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి, రోడ్ ప్రమాదంలో చనిపోవడం కొల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒక స్నేహితుడు చనిపోతే గుండె పోటు, కోత విధించి ఆ కుటుంబం జీవితకాలం మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో యువత విద్యార్థులు స్నేహము అంటే త్రాగుడు, ఎంజాయ్ చేయడం వల్ల, అపుటకు సంతోషిస్తాం, ఆ స్థానంలో మిత్రులు ఉంటే చాలు అని త్రాగుడుకు బానిస అవుతున్నారని అన్నారు. ఇప్పటికే మార్పు రావాలని ప్రజా పరిరక్షణ సమితి నేతలు పిలుపునిచ్చారు.

ఒక వ్యక్తి మనతో స్నేహం చేస్తున్నారు అంటే అతని జీవితకాలం అతని మంచి కోరుకోవడం కలిగి ఉండాలి. ఆ స్నేహానికి సంబంధించి బాసటగా అంటూ, తన స్నేహితునికి మనో దైర్యం ఇస్తూ, అతని మంచి కోరుకోవడం ఉంటే, స్నేహానికి విలువ ఉంటుందని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె బలరాం గారు అన్నారు. మీ తల్లి తండ్రులు కస్టపడి చదివిస్తే, వారికి కన్నీళ్లు ఇస్తారా? సంతోషాన్ని ఇస్తారా? నేటి సమాజంలో యువత, విద్యార్థులు స్నేహము చేసే వారిపై మార్పు రావాలని ప్రజా పరిరక్షణ సమితి నేతలు పిలుపునిచ్చారు. ఈ సందేశం రోడ్ ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరూ గమనించి, విద్యార్థులు, యువత మార్పు కోరుకోవాలి చిన్న ప్రయత్నం మాత్రమే???? పాటిస్తే సమాజం గౌరవిస్తాది. పాటించక పోతే సమాజం మీద గౌరవం పోతుంది. ఇకమీదట నైనా నేటి సమాజంలో యువత విద్యార్థులు స్నేహము కోసం మార్పు చెంది, మన మనసులో మార్పు చెంది, దేశానికి, స్నేహానికి పట్టుకొమ్మలుగా ఉండాలని, ప్రజా పరిరక్షణ సమితి నేతలు పిలుపునిచ్చారు.

See also  కంబాలపాడు బ్రిడ్జి నిర్మాణం కోసం జనసేన పార్టీ పోరాటం