బట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న మంత్రులు,ఇతర నాయకులు

రాష్ట్ర బట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎంపి,ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, డైరెక్టర్లు.జిల్లా టిడిపి అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు.

సత్తెనపల్లి.జనవరి 05 ( జనస్వరం)

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన రాష్ట్ర బట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వర రాజు  ప్రమాణ స్వీకారం మహోత్సవం, అభినందన సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ ,ఎస్. సవిత, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ పల్నాడు అధ్యక్షులు షేక్ జాన్ సైదా, జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పరిశీలకులు తాతా జయప్రకాశ్ నారాయణ మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు.బీసీల రక్షణ చట్టాన్ని అమలుపరుస్తాం.సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ గా సక్సెస్ చేశాం.ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ తన క్రెడిట్ అని అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్. భోగాపురాన్ని ఎయిర్ పోర్ట్ ని, పోలవరాన్ని, అమరావతిని గాలికి వదిలేసిన వ్యక్తి జగన్. జగన్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాడు.కుర్చీ కోసం బాబాయిని రప్పా రప్పా నరికాడు.కుర్చీ కోసం తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు నెట్టాడు.కష్టపడిన కార్యకర్తని, నాయకుడిని గుర్తించి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది అనటానికి వెంకటేశ్వరరాజు ఒక ఉదాహరణ.ఈ పదవిని అలంకారంగా కాకుండా ప్రజల సంక్షేమానికి, భట్రాజుల అభివృద్ధికి కృషి చేయాలని సూచిస్తున్నా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, అన్ని వర్గాలకి సమన్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యి అన్ని పథకాలు, అర్హులందరికీ అందుతున్నాయి.రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ చార్జీల భారం తగ్గించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది.ట్రూ ఆఫ్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా 4,497 కోట్లు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.గత వైసిపి ప్రభుత్వం లో ట్రూ ఆఫ్ పేరుతో 11 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి వినియోగదారులపై విపరీతమైన ఆర్థిక భారం మోపింది.సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లలో రూ. 1000 కోట్లు ఆదా చేసింది.దీంతో ట్రూ డౌన్ చేసి ఆదా ఆయన డబ్బును ప్రజల కరెంటు బిల్లులో తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కరెంటు భారం కూడా ప్రజలపై వేయలేదు.పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్ లో భాగంగా వినియోగదారుడు ఉపయోగించే ఒక్కో యూనిట్ పై 13 పైసలు తగ్గింపు ఇస్తూ గత ఏడాది సెప్టెంబర్ లో రూ. 923 కోట్లు ట్రూ డౌన్ తో రికార్డ్ సాధించారు.రెండు రోజుల క్రితం 4,498 భారాన్ని ప్రజలపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు.ట్రూ ఆఫ్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే చెల్లించే నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ట్రూ ఆఫ్ చార్జీల భారాన్ని తగ్గించడం చేతగాని వైసీపీ విమర్శల పట్ల ప్రజలు చీ కొడుతున్నారు.11 సార్లు విద్యుత్తు చార్జీలు ఇచ్చిన వైసిపి విద్యుత్ అంశాల పట్ల మాట్లాడే అర్హత లేదు.ట్రూ ఆఫ్ చార్జీల భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఊరట కలిగించింది. దీనిపై రాజకీయ విమర్శలు చేయటం తగదు.

See also  వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జనసేన వీరమహిళ సోమరౌతు అనురాధ

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న కూటమి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.