అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించిన మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు దంపతులు

అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించిన మాజీ శాసన సభ్యులు వై వి ఆంజనేయులు దంపతులు.

సత్తెనపల్లి,డిసెంబర్09.(జనస్వరం)

సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వైవి ఆంజనేయులు దంపతులు సమేతంగా సత్తనపల్లి మెయిన్ రోడ్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయం సందర్శించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు సత్యనారాయణ మరియు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది.ఆలయ పూజారులు ఆంజనేయులుకి స్వామివారి పూలదండ మరియు శేష వస్త్రాన్ని బహుకరించడం జరిగింది . వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించడం జరిగింది.తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఎల్ఈడి స్క్రీన్స్ ను ప్రారంభించడం జరిగింది.

ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ దోగిపర్తి సత్యనారాయణ,పుట్టి సాంబశివరావు,పెరుమాళ్ళ శంకర్,చౌటా శ్రీనివాసరావు, జవ్వాజి రామమోహన్ రావు, జింకా లోకేశ్వరరావు, మారెళ్ళ స్వామి, కొబ్బరి సుబ్బారావు, దాసరి కోటేశ్వరరావు, శ్యామల కృష్ణారెడ్డి,లగడపాటి గజానన, తురకపాలెం సర్పంచి మల్లవరపు చంద్రశేఖర్, గోపి , అన్వర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

See also  బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం