కళ్యాణదుర్గం జనసేన సమావేశంలో కీలక అంశాల చర్చ

కళ్యాణదుర్గం, డిసెంబర్ 6, (జనస్వరం) : కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ సమక్షంలో, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, రూరల్ మండల జనసేన నాయకులతో సమావేశం నిర్వహించబడింది. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు హాజరయ్యారు. రాబోయే మండల కమిటీల ఏర్పాటు, క్రియాశీలక సభ్యత్వాల విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక చర్చ జరిగింది. పార్టీ బలం పెంచడం, గ్రామస్థాయిలో జనసేన చేరికలు పెరుగుటకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు పంచుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మండల స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

See also  వరద ముంపు బాధితులకు ప్రభుత్వము తక్షణమే 10 వేల రూపాయలు సాయం అందించాలి : రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్