అరకు నియోజకవర్గం జనసేన ముఖ్య నేతల సమావేశం

    అరకు ( జనస్వరం ) :  అత్యంత సమీప భవిష్యత్తులో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకు జనసేన నేతలు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల మరియు పంచాయతీ స్థాయి కమిటీలను పూర్తి చేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం తో పాటు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయు నిమిత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ చెట్టిచిరంజీవి, జిల్లా కార్యదర్శి ముల్లంగి శ్రీనివాస రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, నియోజకవర్గ మండల నాయకులు బలిజ కోటిపడాల్, రామకృష్ణ, దనేశ్వరరావు, ప్రసాద్, చిన్నారావులు పాల్గొన్నారు.

See also  ఎల్.కోటలో జనం కోసం జనసేన కార్యక్రమం