శుద్ది చేసిన నీటిని అందించండి – స్పందనలో జనసేన ఫిర్యాదు

శుద్ది చేసిన నీటిని అందించండి – స్పందనలో జనసేన ఫిర్యాదు

          ఆకీవీడు మండలం పెదకాపవరం గ్రామంలో గల ఆర్‌.డబ్యుఎస్‌ స్కీము ద్వారా రక్షిత మంచినీరు గ్రామంలో సరఫరా చేయబడుచున్నది. సదరు స్కీము ఫిల్దర్‌ బెడ్‌ లో ఇసుక మార్చి చాలాకాలము అయినందున నీరు పిల్టర్‌ అవ్వకుండా నేరుగా ప్రజలకు సరఫరా కాబడుచున్నది. అందువల్ల ప్రజలు సదరు మురుగు నీరు త్రాగలేక చాలా బాధపడుచున్నారు. అలాగే కలుషిత నీరు త్రాగుట వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురగుచున్నవి. ఈ ఫిల్టర్‌ బెడ్‌లలో ఇసుక మార్చించి ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించవలసినదిగా అనేకసార్లు అధికారులకు విన్నవించుకొనియున్నాము అని జనసైనికులు, వీర మహిళలు అన్నారు. కాని ఇప్పటివరకు అధికారులు తగు చర్యలు తీసుకొనుట లేదని అన్నారు. అధికారుల అలసత్వం వల్ల గ్రామంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తీవ్రమగుచున్నవి. అదేవిధంగా పెదకాపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏటిగట్టు, గొల్లగూదెం ప్రాంతాల వారికి పైపుల ద్వారా నీరు సక్రమముగా సరఫరా అగుట లేదు. ఈ ప్రాంతాలకు నీరు సక్రమముగా అందించలేక పోవుట వల్ల, ప్రజలు త్రాగునీరు దొరకక ఇబ్బందిపడుచున్నారు. కావున పెదకాపవరం గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆర్‌. డబ్యుఎస్‌. స్కీము. పిల్టర్‌ బెడ్‌ లో ఇసుక మార్పు చేయించి ప్రజలకు మంచినీరు అందించవలసినదిగా, ఏటిగట్టు గొల్లగూడెం ప్రాంతాలకు పూర్తిస్థాయిలో మంచినీరు సరఫరా చేయించుటకు తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నాము అని జనసైనికులు మరియు వీరమహిళలు అన్నారు. 

See also  జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన "హెల్పింగ్ హాండ్స్ - ఖాజీపేట" టీమ్