రోడ్డు ప్రమాదంలోని బాధిత కుటుంబానికి రూ.16,000 ఆర్థిక సహాయం చేసిన కర్నాటక జనసైనికులు

రోడ్డు ప్రమాదంలోని బాధిత కుటుంబానికి రూ.16,000 ఆర్థిక సహాయం చేసిన కర్నాటక జనసైనికులు

         ఆంధ్రప్రదేశ్ నుంచి కోలార్ కు వెలుతున్న పేద కుటుంబం ప్రమాదంలో తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అక్కడే ఉన్న వ్యక్తులు అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా సంఘ౦ వారికి తెలియజేశారు. వెంటనే జనసేన కర్నాటక జనసైనికులు మురలి గౌడ మరియు ఆనంద్ వెళ్ళి ఆ బాధితులని పరామర్శించారు. వారికి రూ.16,000 ఆర్థిక సహాయం అందించారు. కర్నాటకలో కూడా జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి బాటలో ఎవరికి ఏం అవసరం వచ్చినా అండగా ఉండేదుకు ఉన్నారని అక్కడి స్థానిక ప్రజలు అభినందించారు. కర్నాటక జనసైనికులు  మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అని, అలాగే రాజకీయ జీవితాన్ని కూడా స్వాగతించామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడ మాకు నచ్చుతాయని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. 

See also  లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సరైన పార్కింగ్ సదుపాయం కల్పించండి : కదిరి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి