కదిరి జనసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

     కదిరి ( జనస్వరం ) : పట్టణంలోని జనసేనపార్టీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్ర పటానికి ఇంచార్జీ భైరవ ప్రసాదు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను బోధించే మధుర కావ్యం రామాయణం. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి నేడు… ఆ రామాయణం స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని ఆకాంక్షిస్తూ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవీంద్ర, వీరాంజనేయులు, నల్లచెరువు మండల కన్వీనర్ సాకే రవికుమార్, పట్టణ ప్రధానకార్యదర్శి అంజిబాబు, కార్యదర్శులు హరీష్, గణేష్, హరిబాబు, రవిశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గములో జనసేనపార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి