ఒంగోలులో విస్కృతంగా జనచైతన్య యాత్ర కార్యక్రమం

ఒంగోలు

   ఒంగోలు ( జనస్వరం ) : స్థానిక నాయకులు కోటు కిరణ్, పసుపులేటి రాజ్ గోపాల్, గద్దె సాయి మహేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 23వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 11వ డివిజన్ రైల్ పేట లో పర్యటించడ౦ జరిగింది. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా అయ్యన్న శెట్టి సత్రం వాసులు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా నివాసం ఉంటున్న మాకు పట్టాలు ఇవ్వలేదని, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తారే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉంటుందని మంచి చేసే నాయకుడు వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత సమస్యను తీర్చడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, మరియు జనసేన నాయకులు బండారు సురేష్, నారాయణరావు, నరసింహారావు, అవినాష్ పర్చూరి, చంద్ర, శ్రీనివాస్, ప్రిన్స్ మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

See also  పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు