బడివానిపేటలో పార్టీ బలోపేతం కోసం జనసేన జెండా ఆవిష్కరణ

బడివానిపేట

     ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల మండలం బడివానిపేటలో జనసైనికుల అధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం జనసేన జెండా ఆవిష్కరించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్. మండల అధ్యక్షులు శ్రీను ఆ గ్రామానికి నాలుగు జనసేన బెంచీలు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు  కాంతి శ్రీ ఇవ్వటం జరిగింది. విశ్వక్షేణ్ గారు మాట్లాడుతూ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎచ్చెర్ల నియోజకవర్గ మత్స్యకార ప్రజలకు మీ అందరికీ అండగా ఉంటా! వలసలను ఆపుదాం ఇక్కడే పని కల్పించేలా మనం చేద్దాం అని మాట ఇవ్వటం జరిగింది. అలాగే బడివానిపేటలో మత్స్యకారులకు త్రాగునీరు సమస్య ఎక్కువ ఉండడంతో అమ్మ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరం చేద్దామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహి, ఆనంద్, రాజశేఖర్, బాబాజీ జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.

See also  నీతి నియమాలు లేని వ్యక్తి జగన్ సీఎం కావడం మన దౌర్భాగ్యం