జనశక్తి బూత్ స్థాయి బలోపేతం కృషి చేస్తున్న ఎల్బి నగర్ శిరీష పొన్నూరు

శిరీష పొన్నూరు

      హైదరబాద్ ( జనస్వరం ) : జనశక్తి బూత్ స్థాయి బలోపేతం లో భాగంగా, ఎల్బి నగర్ నియోజకవర్గంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా నిన్న సాయంత్రం నియోజక వర్గ కో ఆర్డినేటర్ శ్రీమతి శిరీష పొన్నూరు గారు కోతపేట లోని 1,2,3,4& 20,21,22 బూత్ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి  దృష్టికి సమస్యలు తీసుకొచ్చారు. రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయకపోవడం, దళిత బంధు పిల్లల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యలు వివరించారు.  వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేదాకా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల కృష్ణ, శ్యామ్, గౌతమ్, అక్షయ్, లింగం, శివ, రాజశేఖర్, శ్రీను, వీర మహిళలు వెంకట లక్ష్మీ, శాంతి, రాధిక పాల్గొన్నారు.

See also  మదనపల్లి జిల్లా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మద్దతు తెలిపిన జనసేనపార్టీ కార్యదర్శి దారం అనిత