
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వరద ముంపు ప్రాంత ప్రజలకు 2 వరోజు ఆహార పొట్లాలను పంచిన గొల్లప్రోలు జనసైనికులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గొల్లప్రోలు పట్టణంలో వరదకు గురైన 10వ వార్డు మరియు 17వ వార్డులో చేబ్రోలు జనసైనికులు సహాకారంతో 2వ రోజు గొల్లప్రోలు, చేబ్రోలు జనసైనికులు ఆహరం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ఆర్ధిక సహాయం అందించిన వారు సూరిశెట్టి జయకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల మరియు పట్టణ జనసేన నాయకులు చేదులూరి అర్జున్, పెద్దింటి శివ,బుద్దాల శ్రీనివాస్,సామినీడి అప్పారావు, వల్లభశెట్టి మణి, వూట మణి,రెడ్డిమ్ వీరస్వామి(10వ వార్డు), సిద్దా బుజ్జి(11వ వార్డు), కేలాంగి వాసు(17వ వార్డు) మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.









