విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ 

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక జనసేన పార్టీ 47 డివిజన్ కార్యాలయంలో ఆదివారం 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాత చింతలపూడి సత్యనారాయణ వాళ్ళ అమ్మ చింతలపూడి కనకదుర్గ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉంటే బయటకు రావాలని, అది కూడా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గుండు జితేంద్ర, సభ్యులు పొట్నూరి శంకర్, కరణం దివాకర్, మలపరెడ్డి, అప్పారావు, బసవ రాజేష్, జిల్లెల్ల అనిల్, జి అరవింద్ పాల్గొన్నారు.

See also  తక్షణం రాజంపేటను జిల్లాగా ప్రకటించాలి : చిట్వేల్ జనసేన నాయకులు మాదాసు నరసింహ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి