ఆముదాలవలస నియోజకవర్గంలో జనంకోసం జనసేన కేశవదాసు పురం

ఆముదాలవలస

            ఆముదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండలం ( కేశవదాసు పురం గ్రామంలో ) ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలుతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించడం జరిగింది. గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆయనతో పాటుగా మండల నాయకులు యలకల రమణ, జర్జపు శ్రీరామ్, హరీష్, వసంత్, రాజు, గణేష్, గోవింద, నీలకంఠం, రాము, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీతోనే ఉంటాం - వెంపల్లి గౌరీ శంకర్