
పేద కుటుంబానికి అండగా జనసేన
టెక్కలి మండలంలోని గూడెం గ్రామం జనసైనికుడుకి పార్టీ శ్రేణులు అండగా నిలిచాయి. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త అయినటువంటి కోరలాన చిన్నారావు తండ్రి వరధారావు గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు శనివారం చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఒక బస్తా బియ్యం తోపాటు కొంత ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. అలాగే చిన్నారావుకు ఎల్లప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, తోట శ్యామ్, బొడ్డేపల్లి వెంకటేష్, లండ అశోక్, హనుమంతు దిలిప్ పాల్గొన్నారు.









