యువశక్తి కార్యక్రమంను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి : పాలకొండ జనసేన నాయకులు

యువశక్తి

       పాలకొండ ( జనస్వరం ) : జనసేన – గిరిసేన జనం వద్దకు జనసేన(43)వ రోజు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో విస్కృత పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా బి.పి.నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో ఈనెల 12 వ తేదిన జరగబోయే భారీ బహిరంగ సభ “యువశక్తి” (మన యువత – మన భవిత) కార్యక్రమం ప్రచారంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయటం కోసం వాల్ పోస్టర్లు, ఆటో స్టికర్ లను విడుదల చేశారు. కనుక ప్రతి ఒక్క జనసైనికులు వివిధ గ్రామాల్లో పర్యటించి విస్తృత ప్రచారం మొదలుపెట్టాలని జనసేన జానీ తెలియజేయ్యడం జరిగింది. మత్స పుండరీకం యువశక్తి భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, యువతి, యువకులు తప్పకుండా పాల్గోనవలసినదిగా కోరుతున్నామన్నారు. 2024 లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అంటే పాలకొండ నియోజకవర్గం లో యం.యల్.ఏ. గా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమోద, శీల చిన్ని, చింత గోవర్ధన్ నాయుడు, మత్స.సత్యనారాయణ, ఉంగటి శ్రీనివాస్, వావిలపల్లి నాగభూషన్, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

See also  మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి