గురజాడకు విజయనగరం జనసేనపార్టీ నివాళి

గురజాడ

           విజయనగరం ( జనస్వరం ) : మహాకవి గురజాడ 107వ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు గృహంలో ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఆదాడ మోహనరావు,రౌతు సతీష్, ఏర్నాగుల చక్రవర్తి,లోపింటి కళ్యాణ్, త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన ఝాన్సీ వీరమహిళ గంట్లాన పుష్పకుమారి నివాళలర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ గత, ప్రస్తుత ప్రభుత్వాలకు గురజాడ అప్పారావు వర్థంతి, జయంతులకు దండలు వేసి, మిగిలిన రోజుల్లో ఇటువంటి మహనీయులను విస్మరించడమే తప్పా ఎక్కడా గౌరవాన్ని ఇవ్వట్లేదని వాపోయరు. గురజాడ కన్యశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లంగరెత్తుము, దిద్దుబాటు మొదలగు రచనలు సమాజానికి మేలుకొల్పాయని, గురజాడ సాహిత్య రంగానికి, తెలుగు భాషకు, నాటకరంగానికి, చేసిన సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.

See also  ఉరవకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం