తమ గ్రామ సమస్యలను పరిష్కరించమని కోరుతున్న గదపపాలెం గ్రామ జనసైనికులు

తమ గ్రామ సమస్యలను పరిష్కరించమని కోరుతున్న గదపపాలెం గ్రామ జనసైనికులు

                        ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం నడిమి వలస పంచాయతీ గదపపాలెం గ్రామంలో ఈరోజు ఆ గ్రామంలో ఉన్న సమస్యల పై మీడియా కు తెలియచేయడం చేయడం జరిగింది. ఆ గ్రామానికి కనీసం రోడ్డు వసతి కాని, డ్రైనేజీ సమస్య కానీ, స్కూల్ బిల్డింగ్ అయితే మరీ అధ్వానంగా ఉంది. అక్కడ ఒక గ్రామం ఉంది అని కాని అక్కడ మనసు నివసిస్తున్నారని అని కాని అధికారంలో ఉన్న ప్రభుత్వం గానీ అధికార పార్టీ నాయకులకు కానీ అధికారులుగానీ గుర్తించకపోవడం దారుణం.నియోజకవర్గ జనసేన నాయకులు ఈ సమస్య పైన పోరాటం చేసి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను ఇలాంటి గ్రామాలను గుర్తించకుండా అభివృద్ధి చేయాల్సింది పోయి తమకు ఓటు బ్యాంకింగ్ ముఖ్యం అనుకుని ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారు. అభివృద్ధిని ఆదమరిచి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిందని వాపోయారు. ఇలాంటి గ్రామాలను గుర్తించి పోరాటం చేయడానికి జనసేన ముందుంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి అభ్యర్థి భూపతి అర్జున్ గారు, రామకృష్ణ, రామరాజు, సంతోష్.ఎచ్చెర్ల మండలం జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీనివాస్, ముఖ్య నాయకులు మధుబాబుగారు. రణస్థలం మండలం నాయకులు చిరంజీవి గారు. లావేరు మండలం నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ,విజయ్ కృష్ణ, రాజు మరియు స్థానిక గ్రామ జనసేన కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశము

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి