లిబియాలో అదృశ్యమైన యువకుల కోసం జనసేన తరుపున ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం : కణితి కిరణ్

లిబియాలో అదృశ్యమైన యువకుల కోసం జనసేన తరుపున ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం : కణితి కిరణ్

              ఇటీవల 11 రోజుల క్రితం లిబియాలో అదృశ్యమైన సంతబొమ్మలి మండలం సీతానగరం యువకుల బచ్చల వెంకట రావు, బొడ్డు దానయ్య, బచ్చల జోగరావు కుటుంబ సభ్యులను టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సమస్య ను జిల్లా కలెక్టరు గారి ద్వారా భారత రాయబార కార్యాలయానికి చేరవేరుస్తానని అలాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శివశంకర్ గారి ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని కణితి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం జనసేన యువత కుమారస్వామి, దిలీప్, చిరంజీవి, రవి, టెక్కలి నియోజకవర్గ నాయకులు నర్సిపురం శేఖర్, హరీష్, కొత్తూరు హరి, ముడిదాన రాంప్రసాద్, సిగిలిపల్లి సాయి, సాయి మహంతి పాల్గొన్నారు. 

See also  శృంగవరపుకోటలో టీమ్ పిడికిలి పోస్టర్లు విడుదల

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి