సమస్యలను పరిష్కరించమని ఎం‌పి‌డి‌ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన ఆముదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్

సమస్యలను పరిష్కరించమని ఎం‌పి‌డి‌ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన ఆముదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్

              ఆమదాలవలస నియోజకవర్గం జి. కే. వలస గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త అయిన  శిమ్మ. గణేష్ గారిని వైసీపీ పార్టీ వాళ్లు వాళ్ళ ఇంటి ముందు కాలువ ఎత్తు చేసి ఉద్దేశపూరకం గా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని  ఎం‌పి‌డి‌ఓ గారి దృష్టికి  తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ  సమస్య ఏది ఉన్న ముందుగా గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ప్రజలలో ముద్ర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.  అలాగే పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అప్పలనాయుడు, ధర్మ, సాయి పాల్గొన్నారు. 

See also  మహిళలకు రక్షణను గాలికొదిలేసిన ప్రభుత్వం : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి