పాకాల మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సంబరాలు

పాకాల

          పాకాల ( జనస్వరం ) : పాకాల మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సంబరాలు ఘనంగా జరిగాయి. జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నాసీర్, జనసేన నాయకులు దినేష్, వాసు రాయల్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, అరుణ్, షాజహాన్, రహంతుళ్ళ, మస్తాన్, చందభాషా, ఇలియాస్, అసిఫ్  మరియు జనసైనికుల ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో దామలచెరువు, కుక్కలపల్లి, శ్రీహరిపురం, మొగరాల, తురకపల్లి, షాదిమహల్ పలు చోట్ల జన్మదిన వేడుకలు జరిగాయి. నాసీర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చగలిగే శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాత్రమే ఉందని 2019 లో చేసినటువంటి తప్పును పునరావృతం చేయకుండా 2024 లో పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటూ నిలబడితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నేడు కైలు రైతులకు అండగా ఉంటూ ప్రతి జిల్లా తిరుగుతూ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయలు అందిస్తూ వాళ్లకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని తెలిపారు.

See also  జనసేవతోనే జనసేన విజయం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి