రాజోలు నియోజకవర్గ జనసైనికుల కిట్ల పంపిణీలో పాల్గొన్న జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్

                రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం గూడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్ లేకపోయినా జనసైనికులు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గం జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, గంటా కృష్ణ, తోట నాని, జక్కం బాబ్జి, పులి భుజంగరావు, యర్రంశెట్టి మధు, యడ్లపల్లి మహేష్, పులపర్తి రాంబాబు, పిప్పళ్ల దుర్గా ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

See also  చిట్వేల్ మండలంలో ఘనంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు