గోదావరి వరద బాధితులకు తక్షణ సహాయం అందించండి : దార్ల కుమారి లక్ష్మీ

గోదావరి

          రాజోలు ( జనస్వరం ) : గోదావరి వరద పొంచి ఉండడంతో ముందస్తుగా ఏటిగట్టు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటుూ జనసేన తరఫున అండగా ఉంటామని వారికి జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మీ చినబాబు భరోసా ఇస్తున్నారు.  అంతేకాకుండా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేవలం ఆర్థిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం వైద్యం అందించాలని కోరారు. 15 రోజుల వరకు వారు వేటకు వెళ్లలేని పరిస్థితులు రీత్యా మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల వారికి సహకరించి ఆదుకోవాలని జనసేన తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

See also  ఉదయగిరి నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి చేరిన వైసీపి నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి