భట్లపాలిక గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

భట్లపాలిక

        రామచంద్రపురం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్  మరియు గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గారు కలిసి గంగవరం మండలం భట్లపాలిక గ్రామం వెళ్లి గ్రామ కమిటీని వేయడం జరిగింది. భట్లపాలిక గ్రామ అధ్యక్షులుగా గెడ్డం శ్రీనివాస్ నిర్ణయిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  గారు క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ భీమా 5,00,000 రూపాయల కిట్లను అందజేయడం జరిగింది. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.  కార్యక్రమం తదనంతరం రంగా గారి జయంతి సందర్భంగా రంగా గారి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సంపత్, ఏరుపల్లి ఎంపీటీసీ సాక్షి శివకృష్ణ కుమార్, భట్లపాలిక గ్రామ జనసేన నాయకులు గురుమల్ల క్రిష్ణ, వంశీ, తదితర  జనసైనికులు పాల్గొన్నారు. 

See also  జనసేన కార్యాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం అయిన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు