మాస్కులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

మాస్కులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్దకొత్తపల్లి జనసేన పార్టీ కార్యకర్త బాబాజీ నాయకత్వంలో పెద్ద కొత్తపల్లి, కొత్తూరుపేటలో 200 కుటుంబాలకు గాను 500 వందల మాస్కులను జనసేన కార్యకర్తల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్త కాకర్ల బాబాజీ మాట్లాడుతూ కరోనా విభృజిస్తున్న నేపథ్యంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వాడాలని భౌతిక దూరం పాటించాలని కోరారు. మానవసేవే మాధవ సేవేగా భావించి యువత ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని కోరారు. బాబాజీ, మధు గారు తమ స్వంత నిధులతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు తమ వంతుగా సహాయం చేశామని చెప్పారు. ఈ కరోనా కాలంలో యువత ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయాలని కోరారు.

See also  పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు