పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

    పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు  పుట్టపర్తి నియోజకవర్గంలోని జానకి రామయ్య కళ్యాణ మండపం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులకు, సైనికులకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అలాగే మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి నాయకులు జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  పేదరిక కుటుంబానికి రక్త దానంతో పాటు ఆర్థిక సహాయం చేసిన ఆమదాలవలస జన సైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి