
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా కర్నూలులో పూజలు చేసిన జనసేన నాయకులు
లోకాసమస్తా సుఖినోభవంతూ అంటూ కర్నూలు జిల్లాలో జనసేనాని శ్రీ పవన్కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ కుటుంబపై ఎల్లవేళలా ఉంచేలా అలాగే ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి మానవాళిని కాపాడాలని కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తాలోని అభయాంజనేయస్వామి గుడిలో, అలాగే శివాలయంలో అభిషేకంతో పాటు శాంతి హోమాలు మరియు సాయిబాబా గుడిలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీసభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చింతాసురేష్బాబుగారు, జనసేన ముఖ్యనాయకులు శ్రీ నాగేష్అరిగెల గారు, శ్రీ T. మంజునాథ్గారు, శ్రీ కస్తూరి భాస్కర్గారు, శ్రీ Y. బజారిగారు మరియు శ్రీ ఆకెపోగురాంబాబుగారు ఇతర జనసైనికులు పాల్గొనడం జరిగింది.









