మాడుగుల నియోజకవర్గంలో ” పల్లె పల్లెకు – జనసేన “

 మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన పల్లె పల్లెకి జనసేన కార్యక్రమం శుక్రవారం 9వ రోజు కి చేరి ప్రతి పల్లెలో అశేష ప్రజాదరణ పొందుతుంది. 9వ రోజు పల్లె పల్లె కి జనసేన కార్యక్రమం దేవరపల్లి మండలం బొడ్డపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రతి పల్లెలో ప్రభుత్వ వైఫల్యాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు అర్హులు అయ్యి ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందని వారి అందరిని కలిసి వారి వారి సమస్యలను తెలుసుకుని అతి త్వరలో మీ అందరి పట్ల ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని న్యాయం చేయకుంటే ఉపేక్షించేది లేదని గుమ్మడి శ్రీరామ్ ప్రభుతాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా సినిమా టిక్కెట్లు మీద పెట్టిన శ్రద్ధ కాస్త ప్రజల నిత్యావసరాలు పెరుగుదల మీద దృష్టి పెట్టాలని జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు చేరిక