
రైల్వేకోడూరులో మెగా, జనసైనికుల ఆధ్వర్యంలో “మెగాస్టార్ ది లెజెండ్” పుస్తక ఆవిష్కరణ
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు లో భాగంగా 5వ రోజు అయిన బుధవారం, రైల్వేకోడూరు లోని తేజ కళ్యాణ మండపం నందు, అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు (మెగాస్టార్ ది లెజెండ్) పుస్తక ఆవిష్కరణ మెగా అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, మరియు నానబాల పురుషోత్తం గారి ఆధ్వర్యంలో, సీనియర్ మెగా అభిమానులు అందరిని ఏకం చేసి వారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేయటం జరిగింది. సీనియర్ మెగా అభిమానులు మాట్లాడుతు,చిరంజీవి గారికి సినిమా కి అయిన,రాజకీయ పరంగా అయిన,ఆయన వెంట మేము ఎల్లప్పుడూ ఉంటామని, తెలియజేసారు. అదేవిధంగా రాజకీయాలకు,కులమతాలకు,అతీతంగా మమ్మల్ని ఏకం చేసినటువంటి రైల్వేకోడూరు చిరంజీవి యువతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సుబ్రమణ్యం, బొక్కసం చలపతి, పాల చలపతి, నార్జాల మురళి, జోగినేని మణి, నందా బాల, పోతురాజు నవీన్, నార్జాల హేమారాజ్, సోడిశెట్టి సుబ్రమణ్యం, గిద్దలూరు భాను, పండ్రా నాగేంద్ర జనసేన పార్టీ ఇంచార్జి బోనాసి వెంకట సుబ్బయ్య, గంధంశెట్టి దినకర్ బాబు, ముద్దపాల రామ సుబ్బయ్య, ముద్దపాల సభాపతి, ముత్యాల కిషోర్, అంకిపల్లి అఖిల్, కొక్కంటి మహేష్, కుప్పాల జ్యోతి, ప్రకాశ్, మధుసంజు, సుబ్రమణ్యం, రామకృష్ణ, బాలు, గంగాధర్, మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.









