
ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన కార్యాలయం ఏర్పాటు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో క్లిష్టమైన పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రజలు అందరికి మరింతగా అందుబాటులో ఉండాలి అని ఉద్దేశ్యంతో అందరికి అనుకూలమైన చోటు అయిన ఇచ్చాపురం SBI బ్యాంక్ ఎదురుగా జనసేన పార్టీ నూతన కార్యాలయమును ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయ కర్త దాసరి రాజు గారు చేతులు మీదుగా పూజలు నిర్వహించి కార్యాలయమును ప్రారంభించటం జరిగింది. కార్యక్రమం అనంతరం జనసైనికులతో మాట్లాడుతూ ఈసారి ఎవరైనా నన్ను కలవాలన్న నేరుగా పార్టీ ఆఫీస్ కి వచ్చి కలవచ్చు అని అన్నారు. మీ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న పార్టీ కార్యాలయంలో తెలియచేయండి. మీ సమస్యలు మీద పోరాటాం చేసి పరిష్కారం చేయటం కోసమే మేము అంతా రాజకీయాల్లోకి వచ్చింది అని తెలిపారు. పార్టీ లో ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న నేరుగా పార్టీ కార్యాలయన్ని సంప్రదించండి. మీకు నచ్చితే అందరికి చైతన్య పరిచే మంచి పుస్తకాలు, నవలలు ఏమైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే పార్టీ కార్యాలయానికి అందజేయగలరు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం పార్టీ ముఖ్య నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.









