ప్రత్యర్దులకు దీటుగా మున్సిపల్ ఎన్నికలకు బలంగా బరిలోకి దిగుతున్న రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ

                 రామచంద్రపురం పట్టణములో నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 22వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి దూడల మహాలక్ష్మి గారి ప్రచారంలో ఇంటి ఇంటికి మన జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను, జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్తూ ఇతర పార్టీ లకు ధీటుగా బలమైన పోటీ గా బరిలోకి దిగుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుందని అన్నారు.  ప్రజలందరు ఈ అవినీతి పరిపాలన కి ముగింపు పలుకుతూ ప్రత్యామ్నాయంగా రామచంద్రపురం పట్టణము ప్రజలు జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని రామచంద్రపురం పట్టణము మున్సిపాలిటీ 22 వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా దూడల మహాలక్ష్మి గారిని బలపరచడం జరిగింది.  కావున మీ అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీ తో గెలిపించవలసిందిగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది.. ఈ ప్రచారం లో పట్టణ 22 వ వార్డు సభ్యులు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది..

See also  టిడ్కో ఇళ్ళు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి : జనసేన నాయకులు శివ రామకృష్ణ