మే డే సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల

మే డే

         హైదరబాద్ ( జనస్వరం ) : మే డే సందర్భంగా వివిధ రంగాల్లోని కార్మికుల శ్రమను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేతపవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కరోనా సమయంలో విపత్తులో ఉన్న ప్రజలతోపాటు కనీస వేతనం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న కార్మికులకు నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న జనసైనికులు అందరిని అభినందిస్తూ కార్మికులకు అండగా ఎల్లవేళలా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలి దయాకర్, కొల్లా శంకర్, పెనమరెడ్డి నాగబాబు, నాగేంద్ర, తుమ్మల మోహన్, వేముల మహేష్, వెంకటేశ్వరరావు, సునీంద్రబాబు, ప్రసాద్ పసుపులేటి, ప్రసాద్ కలిగినేని తదితరులు పాల్గొన్నారు.

See also  వరల్డ్ పవనిజం డే సందర్భంగా పేదలకు అన్నదానం చేసిన జనసైనికులు