నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బొంతు రాజేశ్వరరావు

బొంతు రాజేశ్వరరావు

         రాజోలు ( జనస్వరం ) : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు గారు అన్నారు. రాజోలు మండలం చింతలపల్లి గ్రామం లో తడిచిన వరి పణలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజుగారు, దొమ్మేటి సత్యనారాయణ గారు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

See also  తుఫాను బాధితులకు జనసేన ఇంఛార్జి వినుత కోటా అన్నదానం