వారాహి విజయవంతంగా రిజిస్ట్రేషన్ కావడంతో అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో వారాహి మాటకు పూజలు

వారాహి

       విజయవాడ ( జనస్వరం ) : తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారి పార్టీ ఆఫీసులో వారాహి మాతకి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం వీర మహిళలు. జనసేన పార్టీ ఎన్నికల యుద్ధ రథం వారాహి విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్భంగా, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్రని విజయవంతంగా పూర్తిచేయాలని, 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, వైసీపీ రక్షస పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత గారు, దోమకొండ మేరీ గారు, అమృత కళాదేవి గారు, పాశం సుజాత గారు, మాకినీడి నీరజ గారు, నాగమణి గారు, శిరీష గారు, స్వాతి గారు, కుమారి గారు, సూర్యవతి గారు, అపర్ణ గారు, నాగ రాజేశ్వరి గారు,విజయ కుమారి గారు, దోమకొండ అశోక్ గారు, పోతిరెడ్డి రమణ గారు, పెళ్లూరి ఉమామహేశ్వరరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

See also  డొనేషన్లు ఇస్తానంటే మూలవిరాట్ ను కూడా తీసుకువెళ్తారా? జనసేనపార్టీ అమ్మవారి ధార్మిక సేవా మండలి