జయరాం రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా “ఇంటింటా జనసేన”

    అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా అనంతపురం నియోజకవర్గంలో 14వ డివిజన్ కమలానగర్ నందు క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో, ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేనపార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, మెరుగు శ్రీనివాస్, నగర్ మంజునాథ్, వెంకటాద్రి నాయక్, నారాయణ నాయక్, చక్రి, హేమంత్, హేమంత్ నాయక్, పురుషోత్తం నాయక్, వెంకట్, కృష్ణ, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  టిడ్కో ఇళ్లకు సీఎం జగన్ గ్రహణం పట్టింది : పోతిన వెంకట మహేష్