ఈరోజు విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో గజపతినగరం జనసైనికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మరియు ఎన్నికలకు జనసేన పార్టీ కార్యకర్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మరియు విజయనగరం ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి గారు పలు సూచనలు, సలహాలు ఇస్తూ జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ప్రతీ కార్యకర్తకు ధైర్యాన్ని నింపి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. యశస్వి గారు మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో నరవ గ్రామంలో ఒక సర్పంచ్ మరియు 7 వార్డులలో మెంబర్లు పోటీ చేయటం చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పండు, పల్లి సత్యనారాయణ, కెల్ల ఈశ్వరరావు, శివ, శంకరరావు, రవితేజ, శ్రీను, పోతల రాంబాబు, Ch.సురేష్, పప్పల వెంకన్న, K. శ్రీను, సిరిపురపు తవుడు, M.పైడినాయుడు పాల్గొనడం జరిగింది.
