జనసేన నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి సాగును ఆపాలని నిరసన వ్యక్తం

గంజాయి

         విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా G.V.M.C గాంధీ విగ్రహం నుంచి జగదాంబ కూడలి వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ధర్మేంధ్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మీ పిల్లలపై ఒక కన్నేసి ఉంచండి. గంజాయి ముఠా యొక్క వ్యాపారానికి ముఖ్య టార్గెట్ యువతీ, యువకులు. కాబట్టి వాళ్ళ వలలో మన పిల్లలు పడకుండా మనకి మనమే కాపాడుకోవాలని అన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తూ గంజాయిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో దాదాపు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందన్న సంగతి ప్రభుత్వ అధికారులకు, పాలక పక్ష నాయకులకు తెలియదంటారా? అని ఆగ్రహించారు. సరిహద్దు కూడా లేని ఆంధ్రా నుంచి గంజాయి మా రాష్ట్రానికి రవాణా అవుతోందంటే ఖచ్చితంగా ఇది ఆంధ్రా అధికార యంత్రాంగం వైఫల్యమే అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way