క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిప్పాన వెంకట్ సత్యంకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో జేఆర్ పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిప్పాన వెంకట్ సత్యంకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ని యోజకవర్గ జనసేన నాయకులు రెడ్డి భాస్కర్ రావు , రామారావు, అన్నంనాయుడు, రాజు జనసేన కార్యకర్తలు మరియు స్ధానికులు వాళ్ల రమణ మరియు కరిమజ్జి రమణ పాల్గొన్నారు.