ఉత్తరాంధ్ర జనసేన ఆలయ పరిరక్షణ కమిటీల ఏర్పాటు నియామక పత్రాలను అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

జనసేన

                విశాఖపట్నం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం ఆలయ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మాధవధార వుడా కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో కొత్త కమిటీ సభ్యులను నియమించి ఉత్తర్వులను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, టి.శివశంకర్‌, నాయకులు భాస్కర్‌ల చేతుల మీదుగా అందజేశారు. సింహాచలం దేవస్థానం, వన్‌టౌన్‌ కనకమహాలక్ష్మి తదితర మందిరాలకు కమిటీ సభ్యులను నియమించారు. ఒక్కో మందిరానికి ఒక్కొక్కరినీ షాడో కమిటీల పేరుతో నియామక పత్రాలు అందించారు. ఆలయాలకు సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు, లొసుగులపై ఈ కమిటీలు పోరాడనున్నాయి. కమిటీ సభ్యులంతా బాధ్యతలకు లోబడి పనిచేయాలని నాయకులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way