మూడేళ్ళ తర్వాత YSR కళ్యాణమస్తు పథకం గుర్తురావడం హాస్యాస్పదం : దోమకొండ అశోక్

          విజయవాడ ( జనస్వరం ) : కళ్యాణమస్తు పథకానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని కండీషన్స్ పెట్టిన YCP నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాని మొగల్రాజపురం జనసేన నాయకులు దోమకొండ అశోక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  అక్టోబర్ 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామన్న కళ్యాణమస్తు పథకాన్ని, గడిచిన మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకున్న పేదింటి ఆడబిడ్డలకు అమలు చేయరా? వారికి వర్తించదా? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నిబంధనలు పెట్టడం దారుణమన్నారు.  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా పేద ప్రజలకు ఇచ్చే పథకాలకు అర్థం లేని కండిషన్స్ ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు.