Search
Close this search box.
Search
Close this search box.

నిరాశ్రయులైన పేద కుటుంబానికి అండగా జనసేన పార్టీ

● బాధిత కుటుంబానికి పరామర్శ
● రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

      కొండపల్లి, (జనస్వరం) : ఈదురు గాలి ప్రభావానికి నిరాశ్రయులైన పేద కుటుంబానికి జనసేన పార్టీ నేతలు అండగా నిలిచారు. కొండపల్లి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇటీవల వీచిన ఈదురు గాలికి ఇంటిపైన రేకులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులైంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు శుక్రవారం ఇందిరమ్మ కాలనీ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ తన వంతు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేది జనసేన పార్టీ మాత్రమేనన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వై.నాగేశ్వరరావు, పులిపాక ప్రకాష్, బత్తిన శ్రీనివాసరావు, చెన్నం శెట్టి కోటేశ్వరరావు, రామంజి, సురేష్, జగదీష్, రమేష్, వీర మహిళలు బొలియశెట్టి విజయ దుర్గ, హేమలత, రాణి, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way