Search
Close this search box.
Search
Close this search box.

ఆముదాలవలసలో జనసేన టిడిపి మద్దతుదారుల పట్ల వైసిపి నేతల దాష్టికం

  ఆమదాలవలస ( జనస్వరం ) : మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్ముడుపేట కు చెందిన జనసేన టిడిపి మద్దతుదారులు అయిన కిల్లి ప్రసాద్ యొక్క కోళ్ల ఫారం ను గత రాత్రి స్థానిక వైసిపి దుండగులు భారీ యంత్రాలతో పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో మద్దతుదారులపై వైసిపి తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్ట పరిహారాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అలాగే, ఈ సంఘటనకు గల కారకులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 15 సంవత్సరాలు లీజుకు ఉన్న స్థలాన్ని కాలపరిమితే పూర్తిగాకముందే తిరిగి అప్పగించాలంటూ వైసీపీ నేతలు బెదిరించారని, కానీ ఇంకా కాల పరిమితి ఉన్నందున న్యాయపరంగా కోర్టు నోటీసులు సదరు స్థల యజమానికి అందించే క్రమంలో గత రాత్రి కోళ్ల ఫారం పై జెసిబి లతో పూర్తిగా ధ్వంసం చేశారని సమాచారం. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని దాదాపు కోటి రూపాయలు విలువచేసే ఈ కోళ్ల ఫారం ను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంపై బాధితులతో కలిసి రామ్మోహన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way