Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ ఓ తాడు బొంగరం లేని పార్టీ : మర్రాపు సురేష్

వైసీపీ

           గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.  మర్రాపు సురేష్ గారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా సమస్యలే ఎవరిని కదిలించిన కన్నీరే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు. కోట్లు కొల్లగొట్టిన ముఖ్యమంత్రి ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఇచ్చాడా? అని అన్నారు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడం హాస్యస్పదం. ఇంకో ఐదు నెలలే, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వమే వస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అపార నష్టమని అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలు అయిందని అన్నారు. వ్యవసాయ రంగంపై వైసీపీ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం మీరే తీసుకొచ్చినట్లు బిల్డప్ ఎందుకు? ఆ సంస్థ తమ ఉత్తరాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసం కార్యాలయం ఏర్పాటు చేసింది. బొత్స టోఫెల్ టోపీ నిజమేనండీ, టోఫెల్ ఒప్పందం సీఎం కార్యాలయం పరిధిలోనే సాగింది. సంబంధిత మంత్రి బొత్సకు తెలియకుండా ఒప్పందం జరిగి ఉండొచ్చు. ఆయన 54 పేజీల ఒప్పందాన్ని చదివి వస్తే చర్చకు మేం సిద్ధమని అన్నారు. ప్రజాధనం లూటీ విషయంలో వైసీపీ రూటే సపరేటు. జనసేన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతుంది. వైసీపీ ఓ తాడు బొంగరం లేని పార్టీ అని, ఆ పార్టీకి అధ్యక్షుడెవరో తెలీదు క్రియాశీలక సభ్యులూ లేరు. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకు కార్యకర్తలు నాయకులు అందరు కలిసి పని చేయాలి అని అన్నారు. 3వ విడత పల్లె పల్లెకు జనసేన కార్యక్రమ౦పై కార్యచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డా. రవికుమార్ మిడతాన,కలిగి పండు, ఆదినారాయణ, మహేష్ శ్రీను, గంట్యాడ మండలం బాలు యాదవ్, గణేష్, హేమసుందర్, లక్ష్మణ, చరణ్, అనిల్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way