తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి కనీస వసతులను కల్పించలేని వైసీపీ ప్రభుత్వం : నలిశెట్టి శ్రీధర్

నలిశెట్టి శ్రీధర్

         ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణ సమీపంలోని జగనన్న కాలనీలను మరియు మున్సిపాలిటీ పరిధిలోని జాలయ్య నగరం సమీపంలోని టిట్కో గృహ సముదాయాలను సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలలో 1936 ఇళ్ళ కు గాను, కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి.టిడ్కో గృహాలు పూర్తయి మూడు సంవత్సరముల కాలం గడిచినప్పటికీ నేటి వరకు పూర్తిగా గృహాలను లబ్ధిదారులకు కేటాయించడం జరగలేదు. మిగిలిన గృహాలను కూడా లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని మరియు తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి కనీస వసతులను కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. 1936 కాలనీలకు గాను కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి అంటే నిరుపేదలకు మీరు ఇస్తున్న ఇళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేసి ఇస్తారు? స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వంశీ, చంద్ర, నాగరాజు, తిరుమల, భాను, పవన్, అనిల్, మదన్, హజరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way